రెండు బైకులు ఢీ.. ఒకరి దుర్మరణం

by Disha Web Desk 11 |
రెండు బైకులు ఢీ.. ఒకరి దుర్మరణం
X

దిశ, జడ్చర్ల: రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన జడ్చర్ల మండల పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం గోపులాపూర్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో కేశంపేట మండలం కాకనూరు గ్రామానికి చెందిన కురువ కుమార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. జడ్చర్ల పట్టణానికి చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అటుగా వెళుతున్న జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ ఖాన్ ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి 108కు పోలీసులకు సమాచారం అందించారు.

క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 సహాయంతో మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ లెనిన్ గౌడ్ లు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు కాకనూర్ గ్రామానికి చెందిన కురువ కుమార్ జడ్చర్ల పట్టణంలో తాను పండించిన పంటను అమ్ముకోవడం కొరకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి భార్య లక్ష్మమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు.

Next Story

Most Viewed