ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

by Disha Web Desk 1 |
ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ
X

దిశ, తాడ్వాయి : గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దోచుకెళ్లిన ఘటన మండల పరిధిలోని కృష్ణజివాడి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో బద్ధం బాలారెడ్డి వ్యవసాయ పొలం వద్ద 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దోచుకెళ్లారు. శనివారం అటుగా వెళ్లిన రైతు ట్రాన్స్ ఫార్మర్ చోరికి గురైనట్లుగా గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందజేశారు. లైన్ మెన్ అలీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.


Next Story