విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి యువకుల మృతి..

by Disha Web Desk 11 |
విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి యువకుల మృతి..
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతైన సంఘటన గురువారం అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం మొహమ్మద్ సుఫియన్ హుస్సేన్ (18), సయ్యద్ అనాస్ (14 ) లు మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి సంఘీలోని చెరువులో ఈతకు వెళ్లారు.
ఇద్దరు యువకులు ఈత కొడుతూ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్ డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ సిబ్బంది కలిసి చెరువులో పడి చనిపోయిన ఇద్దరి మృతదేహలను వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed