వరంగల్ లో విషాదం.. మ‌హిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం..?

by Disha Web Desk 11 |
వరంగల్ లో విషాదం.. మ‌హిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం..?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వరంగల్‌లో మ‌హిళా కానిస్టేబుల్ ఎదులాపురం మౌనిక‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భ‌ర్త శ్రీధ‌ర్‌ తీవ్రంగా కొట్టి ఆ త‌ర్వాత ఉరేసుకున్నట్లుగా చిత్రీక‌రిస్తున్నాడని మృతురాలి త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ఆదివారం ఉద‌యం జ‌రుగగా ఆల‌స్యంగా మధ్యాహ్నం వెలుగులోకి వ‌చ్చింది. మౌనిక‌ను శ్రీధ‌ర్‌ నిత్యం వేధింపుల‌కు గురిచేసేవాడ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

మ‌ట్టెవాడ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు కాగా మృతదేహాన్ని ఎంజీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కీల‌కంగా మార‌నుంది. ఇది ఇలా ఉండగా మౌనిక మహబూబాబాద్ డీఎస్పీ కార్యాల‌యంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది.

Next Story

Most Viewed