రంగారెడ్డిలో విషాదం.. భార్య చూస్తుండగానే భర్త సూసైడ్

by Disha Web Desk 4 |
రంగారెడ్డిలో విషాదం.. భార్య చూస్తుండగానే భర్త సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యతో చిన్న గొడవ పడ్డ భర్త భార్య చూస్తుండగానే సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. నార్సింగి పీఎస్ పరిధిలోని పీరం చెరువుకు చెందిన రేవన్ సిద్ధప్ప భార్యతో గొడవపడి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed