- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారని తెలిసింది. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు.
కృష్ణా నదిలో స్నానం చేయాలని తలంచి సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న కృష్ణానదికి వెళ్లారు. ఐదుగురు చిన్నారులు వెళ్గగా నలుగురు కృష్ణా నదిలో మునిగిపోయారు. ఓ పాప మాత్రం ఒడ్డున ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story