రైలుకింద పడి ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

by Disha Web Desk 1 |
రైలుకింద పడి ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
X

దిశ, ఓదెల: రైలుకింద పడి ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన ఓదెల మండల పరిధిలోని పోత్కపల్లి రైల్వే స్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న షేక్ హమీద్ పాషా ఆదివారం రాత్రి విధులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. ట్రైన్ దిగిన కానిస్టేబుల్ ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దిగకుండా పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో అతను కాళ్లు జారి రైలు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో హమీద్ పాషా కుడి కాలు పాదం నుజ్జునుజ్జయింది. కుడి చెతితో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.



Next Story