- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో ‘టాయ్ కారు’ బాంబు కలకలం.. ఐసిస్, జైషే ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం!
ముంబైలో బొమ్మ కార్లతో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐసిస్, జైషే ఉగ్రవాదుల కుట్రను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది.

దిశ, వెబ్డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని ఎవరూ ఊహించని విధంగా భారీ పేలుళ్లతో అతలాకుతలం చేసేందుకు ఉగ్రవాదులు వినూత్న కుట్రను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అధికారులు భగ్నం చేశారు. రిమోట్ కంట్రోల్తో నడిచే బొమ్మ కార్లలో పేలుడు పదార్థాలను అమర్చి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేల్చాలని ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి పేలుడు పదార్థాలను అమర్చేందుకు సిద్ధం చేసిన ఎలక్ట్రానిక్ బోర్డులు, పదులు సంఖ్యలో రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించే నిషేధిత వీడియోలు, పుస్తకాలను సైతం సీజ్ చేశారు. అయితే, నిందితులు ముంబైలోని ప్రముఖ రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పథకం రచించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, లాప్టాప్లను పరిశీలిస్తున్న అధికారులు, ఈ నెట్వర్క్లో ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనతో ముంబై పోలీసులు నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించారు.
కుట్ర వెనుక విదేశీ హస్తం..?
అరెస్ట్ అయిన నిందితులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ (JeM), ఐసిస్ (ISIS)తో సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. వీరు సోషల్ మీడియా ద్వారా విదేశాల్లోని తమ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నపిల్లలు ఆడుకునే ‘టాయ్ కార్ల’ను బాంబులుగా మార్చే సాంకేతికతను వీరు నేర్చుకున్నట్లుగా విచారణలో బట్టబయలైంది.






