తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

by Disha Web Desk 2 |
తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
X

దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం మండలంలోని దేవరంపల్లి గ్రామంలో కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు అశోక్, ఆయన భార్య అంకిత, వారి మూడు నెలల కూతురుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed