చింద్రమైన బతుకులు.. రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు, కోడలు మృతి

by Disha Web Desk 19 |
చింద్రమైన బతుకులు.. రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు, కోడలు మృతి
X

దిశ, గద్వాల: పొట్టకూటికోసం ఊరూరు తిరుగుతూ ఇంటి పాత బట్టలు తీసుకుని వంట పాత్రలు సామాగ్రి అమ్ముకుని జీవనం సాగించే ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పారుచర్ల స్టేజ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం బలైంది. పూర్తి వివరాల ప్రకారం.. గద్వాల టౌన్‌కు చెందిన జమ్ములమ్మ(50) ఆమె కొడుకు అర్జున్ (24), కోడలు వైషాలీ(22) పల్లె పల్లెకు తిరుగుతూ వంట సామాగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇదే క్రమంలో శనివారం వీళ్లు ముగ్గురు కలిసి గద్వాల్ నుంచి ధరూర్ వెళ్లుతుండగా పారుచర్ల స్టేజ్ వద్ద ఓ బొలేరో వాహనం ఢీ కొట్టగా ఆటోలో వెళ్లుతున్న ఈ ముగ్గురు సంఘటన స్థలంలో మృతి చెందారు. బొలేరో వాహనం మితి మీరిన వేగంతో వెళ్లే సమయంలో ముందుగా వెళ్లుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి గద్వాల్ డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కర్నె శేఖర్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. క్షత్రగాత్రులను గద్వాల్ ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed