మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారం..

by Disha Web Desk 6 |
మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం జరిగింది. మహిళపై ముగ్గురు వైద్యులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని కొత్వాతిలోని కైలీ ఆస్పత్రికి చెందిన వైద్యుడు లక్నోకు చెందిన ఓ మహిళతో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తన మాయమాటలతో ఆమెను నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళను ఆగస్టు 10వ తేదీన ఆసుపత్రికి పిలిపించుకొని హాస్టల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. రూమ్‌లో తన ఇద్దరు వైద్య స్నేహితులు ఉన్నారు. ముగ్గురూ కలిసి అమెపై అత్యాచారం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు వైద్యులపై సెప్టెంబర్ 29న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.


Next Story