కారు అద్దాలు పగలగొట్టి.. సినీ ఫక్కీలో రూ.5 లక్షలు చోరీ

by Disha Web Desk 1 |
కారు అద్దాలు పగలగొట్టి.. సినీ ఫక్కీలో రూ.5 లక్షలు చోరీ
X

దిశ , కోనరావుపేట : కారు అద్దాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షలతో ఉడాయించిన ఘటన వేములవాడ మండలం చంద్రగిరి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కల్లెపు శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేశాడు. అనంతరం అతను చంద్రగిరి గ్రామంలోని వారి బంధువుల ఇంటి ముందు కారు నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే దుండగులు కారు వద్దకు వెళ్లి, కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ.5 లక్షల నగదను దొచుకెళ్లారు. దీంతో లబోదిబోమన్న బాధితుడు మంటు శ్రీనివాస్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేస్తున్న సమయంలోనే దుండగులు కనిపెట్టి పథకం ప్రకారమే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా బ్యాంక్ ఏరియాలోని సీసీ కెమెరాలను పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed