కన్నతల్లిని దారుణంగా కొట్టిచంపిన కుమారుడు

by Disha Web Desk 2 |
కన్నతల్లిని దారుణంగా కొట్టిచంపిన కుమారుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా ఇరుకుల్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుమారుడు కన్నతల్లిని హత్య చేశాడు. ఆస్తి పంపకాల విషయంలో అన్నాదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తల్లి గొడవ ఆపడానికి ప్రయత్నించింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారుడు లింగయ్య తల్లి తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. అనంతరం సోదరుడు రాజయ్యపైనా దాడి చేయగా.. రాజయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed