దారుణం.. మండుటెండలో 7 కిలోమీటర్లు నడవడంతో నిండు గర్భిణీ మృతి

by Disha Web Desk 19 |
దారుణం.. మండుటెండలో 7 కిలోమీటర్లు నడవడంతో నిండు గర్భిణీ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో మండుటెండలో ఓ నిండుగర్భిణి 7 కి.మీలు నడిచింది. దీంతో వడదెబ్బ తగిలి మృతి చెందింది. ఈ దారుణ ఘటన పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గిరిజన గ్రామమైన ఓసర్ వీరాకు చెందిన సోనాలి వాఘట్ (29) తొమ్మిది నెలల గర్భిణి. నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం తవాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నడిచి వెళ్లింది. ఆ తరువాత అక్కడి నుంచి ఇంటికి నడిచి వచ్చింది. అలా మొత్తం 7 కి.మీ.లు మండుటెండలో నడిచింది. దీంతో వడదెబ్బ తగిలి.. సాయంత్రానికి సోనాలి తీవ్ర అస్వస్థతకు గురైంది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె అస్వస్థత కారణంగా కడుపులోని శిశువు కూడా ప్రాణాలు విడిచింది.


Next Story

Most Viewed