రాజేష్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటపడ్డ అసలు నిజం!

by Disha Web Desk 19 |
రాజేష్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన హయత్​నగర్ అనుమానాస్పద మరణం కేసులో మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మృతుడు రాజేశ్​విషం కారణంగానే చనిపోయినట్టుగా పోస్టుమార్టంలో వెల్లడైనట్టు తెలిసింది. అయితే, రాజేశ్​తనుకు తానుగానే విషం సేవించాడా? బలవంతంగా అతనితో తాగించారా? అన్నది మిస్టరీగా మారింది.

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే రాజేశ్​మృతదేహం దొరికిన చోట విషానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవటం. ఏడు నెలల క్రితం వనస్థలిపురం నివాసి సుజాత మొబైల్​నుంచి రాజేశ్‌కు రాంగ్​కాల్​వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సుజాత వాట్సాప్​డీపీ చూసిన రాజేశ్​ఆమెకు పెళ్లి కాలేదని భావించి వివాహం చేసుకుంటానంటూ ఆమెకు వాట్సాప్​మెసెజ్​పెట్టినట్టు సమాచారం.

ఆ తరువాత సుజాతకు పెళ్లయిందన్న విషయం తెలిసి రాజేశ్​ఆమెను దూరం పెట్టినట్టు తెలిసింది. కాగా, రాజేశ్‌కు పలుమార్లు ఫోన్​చేసిన సుజాత తనను కలవాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్టు సమాచారం. దాంతో భయపడ్డ రాజేశ్​ఈనెల 24న ఆమెను కలవటానికి వచ్చాడు. అయితే, అప్పటికే సుజాత విషం సేవించగా ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలియని రాజేశ్​ఆమె ఇంటికి వెళ్లగా సుజాత కుటుంబసభ్యులు, బంధువులు అతనితో గొడవ పడినట్టు సమాచారం.

అప్పుడే సుజాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం రాజేశ్‌కు తెలిసింది. ఆ తరువాత వెళ్లిపోయిన రాజేశ్​అయిదు రోజుల తరువాత హయత్​నగర్​స్టేషన్​పరిధిలో శవమై కనిపించాడు. సుజాత కుటుంబసభ్యులు, బంధువులతో జరిగిన గొడవ నేపథ్యంలో అంతా ఇది హత్యే అనుకున్నారు. అయితే, మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో రాజేశ్​ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టమైనట్టు తెలిసింది.

విషం కారణంగానే అతను మరణించినట్టుగా తేలిందని సమాచారం. ఈ క్రమంలో సుజాత ఆస్పత్రిలో చనిపోయిన నేపథ్యంలో భయపడ్డ రాజేశ్​తనుకు తానుగా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతనితో ఎవరైనా అతనితో బలవంతంగా విషం తాగించారా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.


Next Story

Most Viewed