వ్యక్తి అదృశ్యం..

by Disha Web Desk 11 |
వ్యక్తి అదృశ్యం..
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: బోయిన్ పల్లి దిల్ కుష్ నగర్ కు చెందిన సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ (28) అనే వ్యక్తి అదృశ్యయ్యాడు. బోయిన్ పల్లి ఎస్.ఐ నాగేంద్ర బాబు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్ కుష్ నగర్ లో నివాసం ఉంటున్న సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ గత కొంత కాలంగా ఇంట్లో నే ఉంటూ సరదాగా జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే గత కొంత కాలంగా సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ మాసికంగా వేరే ఆలోచనలో ఉంటూ రాత్రి సమయాల్లో ఇంటికి తిరిగి వస్తుండే వాడు.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు . ఉదయం తన కుమారుడు లేడని గ్రహించిన తండ్రి అతని ఫోన్ కు పలుమార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది . తెలిసినవారిని స్నేహితులను ఆరాతీసిన ఫలితం లేకుండాపోయింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి బుధవారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed