వ్యవసాయ బావిలో ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి

by Sumithra |
వ్యవసాయ బావిలో ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి
X

దిశ, నర్సంపేట : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం అజ్మీరా.కీమా (45) శుక్రవారం తెల్లవారుజామున వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో దున్నుతుండగా రివర్స్ వెళ్లే క్రమంలో సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్టు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story