ఆ పనికి అడ్డుపడ్డారని తల్లిదండ్రులను గొడ్డలితో అతి కిరాతకంగా చంపిన కూతురు

by Disha Web Desk 7 |
ఆ పనికి అడ్డుపడ్డారని తల్లిదండ్రులను గొడ్డలితో అతి కిరాతకంగా చంపిన కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్: కంటే కూతురినే కనాలి అంటారు పెద్దలు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చిన.. తల్లిదండ్రులను కూతురు కంటికి రెప్పలా కాపాడు కుటుంది. కానీ.. దీనికి విరుద్ధంగా వ్యవహరించింది ఓ కూతురు. ప్రేమకు అడ్డం వస్తున్నారని కని పెంచిన తల్లిదండ్రులనే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బులందషహర్‌లో ఫరూఖీ నగర్ లాల్ దర్వాజా మొహల్లాలోని నివాసం ఉంటున్న షబ్బీర్ (45), రిహానా (42) దంపతులకు ఒక్కగానొక్క కూతురు(17) ఉండేది. ఆ బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అతడితో తిరగడం మొదలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అతడితో తిరగొద్దని కొట్టారు. దీంతో వారిపై కోపం పెంచుకున్న బాలిక తల్లిదండ్రులను చంపాలి అనుకుంది. దీనికి ఆమె ప్రియుడి దగ్గర 20 మత్తు మాత్రలు తీసుకుని వాటిని ఆహారంలో కలిపి తల్లిదండ్రులకు పెట్టింది.

వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక తల్లిదండ్రులు అని కూడా చూడకుండా గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపింది. అయితే తల్లిదండ్రుల మృతిపై అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఈ నిజాలు తెలిశాయి. దీంతో ఆ మైనర్ బాలికను, ఆమె ప్రియుడుని అదుపులోకి తీసుకుని.. జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు ఎస్ఎస్‌పీ శ్లోక్ కుమార్ తెలిసారు. అంతేకాకుండా.. హత్య చేసేందుకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed