పట్టపగలే చోరీలు.. ఇద్దరి అరెస్ట్​

by Dishafeatures2 |
పట్టపగలే చోరీలు.. ఇద్దరి అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పట్టపగలే చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని బహదూర్​పురా పోలీస్​స్టేషన్​ క్రైం టీం సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా 42వేల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కిషన్​ బాగ్​ నజమ్​నగర్ ​ప్రాంత వాస్తవ్యుడైన ఠాకూర్​ ఉదయ్​సింగ్​(23) అత్తాపూర్​లోని వినాయక క్లాత్​స్టోర్​లో సేల్స్​మెన్​గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సయ్యద్​ షోయబ్​ అహమద్​(20)తో అతనికి స్నేహం ఉంది. కాగా, కిషన్​బాగ్​లోని ఓ ప్రైవేట్​స్కూల్​నుంచి 10వ తరగతి పూర్తి చేసిన ఉదయ్​సింగ్ ​ఆ తరువాత దుర్వ్యసనాలకు బానిసగా మారాడు. ఈ క్రమంలో చెడు సావాసాలు కూడా చేశాడు. 2021లో సహచరులతో కలిసి రాంగోపాల్​పేట పోలీస్​స్టేషన్ n​పరిధిలోని ఓ ఇంట్లో దొంగతనం చేయటంతోపాటు ఇంట్లోని మహిళపై అత్యాచారం జరిపాడు.

ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి కొంతకాలానికి విడుదలయ్యాడు. అయితే, ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. స్నేహితుడు షోయబ్​తో కలిసి ఇటీవలే బహదూర్​పురా పోలీస్​స్టేషన్​పరిధిలోని ఓ ఇంట్లోకి పట్టపగలే చొరబడి లక్షా 42వేల రూపాల విలువ చేసే బంగారాన్ని తస్కరించాడు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన బహదూర్​పురా పోలీస్​స్టేషన్ క్రైం టీం సిబ్బంది శనివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఫలక్​నుమా ఏసీపీ సుధాకర్​పర్యవేక్షణలో బహదూర్​పురా సీఐ అనిల్​కుమార్, డీఐ శ్రీశైలం, డీఎస్ఐ శ్రీకాంత్​నిందితులను అరెస్టు చేయటంలో కీలకపాత్ర వహించారు.

Next Story

Most Viewed