బ్రేకింగ్: వంతెనను ఢీకొట్టిన బస్సు.. 20 మంది ప్రయాణికులు స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: వంతెనను ఢీకొట్టిన బస్సు.. 20 మంది ప్రయాణికులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం 49 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఓ వంతెనను ఢీకొట్టింది. దీంతో బస్సు నుండి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed