ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు..

by Disha Web Desk 11 |
ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు..
X

దిశ, రాజాపూర్: వేసవి కాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈతకు వెళ్లిన స్నేహితుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన దీక్షిత్ (16) 9వ తరగతి చదువుతున్నాడు. ఈతకు స్నేహితులతో కలిసి ఖానాపూర్ గ్రామంలో గల బావికి వెళ్లారు. అందరూ ఈత కొడుతూ ఉన్నారు. కొంత మంది అబ్బాయిలు బావిపై నుంచి దూకడంతో వాళ్లతో పాటు దీక్షిత్ కూడా దూకాడు.

ఎంతకూ పైకి తేలకపోవడంతో స్నేహితులు, గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. అనంతరం ఘటన స్థలానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చి బావిలో ఉన్న నీళ్లను ట్రాక్టర్ సాయంతో బయటకి తోడేస్తున్నారు రాత్రి 8 గంటలు అయినా ఇంతవరకు గల్లంతైన బాలుడు దొరకలేదు. ఘటన స్థలం వద్ద ఎస్సై వెంకట్ రెడ్డి, తహసిల్దార్ రామ్ భాయ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.



Next Story