అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి...

by Disha Web Desk 20 |
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి...
X

దిశ, హుజూర్‌నగర్ : ట్రాక్టర్ అదుపుతప్పి బాలుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేపల సింగారం గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా ఇటీవలే తన వ్యవసాయ పనుల కోసం ఒక ట్రాక్టర్ ను కొనుగోలు చేశారు. వ్యవసాయ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం తన ట్రాక్టర్ తో పొలం దున్నేందుకు తన కుటుంబ సభ్యులైన ఇద్దరు కుమారులు, తండ్రితో పాటు భర్యను కూడా ట్రాక్టర్ పై ఎక్కించుకొని వెళ్తున్నాడు.

కాగా మార్గమద్యంలో రోడ్డు గుంతలుగా ఆ ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వకట్ట నుండి క్రిందకి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్ మీరా పెద్ద కుమారుడు షేక్ అనుజిత్ (7) అక్కడికక్కడే మృతి చెందగా మృతుని తండ్రి నాగుల్ మీరా, తల్లి సమీరా, తాత హుస్సేన్ లు గాయాలపాలయ్యారు. దీంతో స్థానికులు వీరిని మెుదట హుజూర్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హుజూర్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Next Story