మానుకోటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం..!

by Ratna Kumari |   (  Updated:2026-05-08 07:01:11  IST  )

ప‌ట్ట‌ణంలోని న‌ర్సంపేట రోడ్డులో ఓ షోరూం స‌మీపంలో గుర్తు తెలియ‌ని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.

మానుకోటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం..!
X

దిశ‌, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : ప‌ట్ట‌ణంలోని న‌ర్సంపేట రోడ్డులో ఓ షోరూం స‌మీపంలో గుర్తు తెలియ‌ని మహిళ మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన మహిళ అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఆమె ఎవరు..? ఎక్కడికి చెందినవారు..? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిందా..? లేక ఇతర అనుమానాస్పద పరిస్థితులున్నాయా..? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Next Story