మత్తు మందు ఇచ్చి మైనర్‌పై సామూహిక అత్యాచారం..

by Disha Web Desk 6 |
మత్తు మందు ఇచ్చి మైనర్‌పై సామూహిక అత్యాచారం..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో అత్యాచారాలు కలవరపెడుతున్నాయి. సమాజంలో అసలు అమ్మాయిలకు రక్షణ కరువైంది. తాజాగా 13 ఏళ్ల మైనర్‌కు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. 13 ఏళ్ల మైనర్‌‌ను ఓ ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తాగిన బాలిక సృహా కోల్పోవడంతో ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మరో వ్యక్తి అతడికి మద్దతు ఇచ్చాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed