నల్సార్ లా యూనివర్సిటితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పదం

by Ajay Maddhiboyina |

నల్సార్ లా యూనివర్సిటితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పదం కుదుర్చుకోవడం ద్వారా కేసుల పరిష్కారం, సైబర్ సెక్యూరిటి సిబ్బందికి చట్టాల పై అవగాహన పెరుగుతుందని డీజీపీ జితేందర్, సైబర్ సెక్యూరిటి బ్యూరో శిఖా గోయల్ తెలిపారు.

నల్సార్ లా యూనివర్సిటితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నల్సార్ లా యూనివర్సిటితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పదం కుదుర్చుకోవడం ద్వారా కేసుల పరిష్కారం, సైబర్ సెక్యూరిటి సిబ్బందికి చట్టాల పై అవగాహన పెరుగుతుందని డీజీపీ జితేందర్, సైబర్ సెక్యూరిటి బ్యూరో శిఖా గోయల్ తెలిపారు. ఈ ఒప్పదం ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు , నింధితులకు శిక్ష పడేందుకు దోహద పడుతుందని తెలిపారు. డీజీపీ కార్యాలయంలో నల్సార్ లా యూనివర్సటి వైస్ ఛాన్సలర్ ఫ్రోఫెసర్ శ్రీకృష్ణ దేవరావుతో బుధవారం సమావేశమయ్యారు. ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. సైబర్ నేరాల కేసుల పరిష్కారానికి లీగల్ ఫ్రేమ్ వర్క్ బలోపేతం చేయానికి ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ అడ్వైజరీ పెంపోదించేందుకు టీజీసీఎస్బీ కృషి చేస్తుందని తెలిపారు.

Next Story