Tamilnadu: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. భారీగా ప్రాణనష్టం ఉండే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-13 05:24:02  IST  )

తమిళనాడులోని విరుధునగర్ జిల్లా సాత్తూరులో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.

Tamilnadu: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. భారీగా ప్రాణనష్టం ఉండే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu)లోని విరుధునగర్ (Virudhu Nagar) జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సాత్తూరు (Satturu) సమీపంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాణసంచా తయారీలో ఉన్న రసాయనాల కారణంగా పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ధాటికి ఫ్యాక్టరీలోని ఏకంగా ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్యాక్టరీలో సుమారు 60 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశారు. భారీగా ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతి వేడి కారణంగా రసాయనాలు పేలాయా లేదా అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story