స్నానానికని వెళ్లి అనంత లోకాలకు..

by Disha Web Desk 1 |
స్నానానికని వెళ్లి అనంత లోకాలకు..
X

దిశ, కామారెడ్డి రూరల్ : స్నానానికి చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు మునిగి మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణ శివారులోని సరంపల్లిలో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ కథనం మేరకు.. సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల లింగం (45) అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెరువు వద్దకు స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు.


Next Story

Most Viewed