ఆ వ్యక్తి ఎలా మృతి చెందాడో తెలుసా..

by Disha Web Desk 20 |
ఆ వ్యక్తి ఎలా మృతి చెందాడో తెలుసా..
X

దిశ, జన్నారం : మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన జాడి రాజన్న(43) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బయటికి వెళ్లిన రాజన్న రోజులాగే మంగళవారం రాత్రి కూడా ఇంటికి వచ్చి పడుకున్నాడు. బుధవారం సాయంత్రం వరకు లేవక పోవడాన్ని అతని కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు గమనించారు. దగ్గరికి వచ్చి చూసేసరికి అతను మృతి చెంది ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారికి అతను ఎలా చనిపోయాడో అన్న అనుమానం మొదలైంది.

కొందరేమో పాము కుట్టి చనిపోయాడనుకుంటే మరి కొంత మంది అతను ఫిట్స్ తో చనిపోయాడని చర్చించుకున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రాజన్న కొంత కాలం నుంచి తాగుడుకు బానిసయ్యాని తెలిపారు. ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడని, తిండి మానేసి ఉండేవాడని తెలిపారు. దీంతో కొన్ని రోజుల నుంచి అనారోగ్యం పాలయ్యాడని వారు తెలిపారు. ఆ కారణంగానే చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు జన్నారం అదనపు ఎస్సై తానాజి తెలిపారు.

ALSO READ : ఊరికి వెళతానని చెప్పిన ఓ వ్యక్తి .. ఎక్కడికి వెళ్లాడంటే..



Next Story

Most Viewed