అనుమానాస్పదంగా వివాహిత మృతి

by Disha Web Desk 12 |
అనుమానాస్పదంగా వివాహిత మృతి
X

దిశ, దమ్మపేట: అనుమానాస్పద రీతిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తన భార్య సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిందని భార్య తరపు బంధువులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న మహిళా తల్లిదండ్రులు కూతురు ఒంటిపై గాయాలు గుర్తించడంతో గుండెపోటుతో మృతి చెందలేదని భర్త నాగేంద్రబాబు హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేసి నాగేంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు మృతి పట్ల దమ్మపేట పోలీసులు సమాచారం అందించారు.

చల్ల నాగేంద్రబాబు, మౌనికకు 2011లో వివాహం జరిగిందని, పెళ్లయిన సంవత్సరం తర్వాత నుంచి కట్నం కోసం తీవ్రంగా మౌనికను వేధించేవాడని, వేధిస్తున్నప్పుడల్లా ఎంతో కొంత డబ్బును తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళమని, అనంతరం 10 కాసుల బంగారం కూడా చేయించి ఇచ్చామని, కూతురు పుట్టిన దగ్గర నుంచి వేధింపులు మరింత తీవ్రతరం చేశాడని, నాగేంద్రబాబు వేరే పెళ్లి చేసుకుంటానని అనేకసార్లు భార్య మౌనికతో అంటూ.. మానసికంగా వేధించేవాడని, అయినప్పటికీ మౌనిక ఇల్లు విడిచి వెళ్లకపోవడంతో సోమవారం రాత్రి మౌనికను తీవ్రంగా కొట్టి చంపాడని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట మార్చురికి తరలించారు.



Next Story

Most Viewed