డొడర్న సర్పంచ్ ఆకస్మిక మృతి..

by Disha Web Desk 20 |
డొడర్న సర్పంచ్ ఆకస్మిక మృతి..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని డొడర్న గ్రామ సర్పంచ్ షానూర్ బేగం (80) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వృద్ధురాలు అయినప్పటికీ ఇటీవల మంగళవారం జరిగిన మండల సమావేశానికి సైతం హాజరయ్యారు.

ఆరోగ్యంగానే ఉంటూ తన పనులు తాను చేసుకునేది. గ్రామ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ గ్రామ సమస్యలను సైతం తెలుసుకునేది. ఆమె అకాల మరణానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం ప్రకటించారు.



Next Story

Most Viewed