నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి..

by Disha Web Desk 11 |
నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ స్థావరంపై ఎస్ఓటీ పోలీసుల దాడి..
X

దిశ, కీసర: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నాగారం శివారు ఈస్ట్ గాంధీ నగర్ లో ఓ స్థావరం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు గోపాల్, విజయలక్ష్మి రేషన్ బియ్యం సేకరించి వాటికి మసాలా దినుసులు కలిపి దానికి తోడు కెమికల్స్ యాడ్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండే సామర్థ్యంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు.

వీటి ద్వారా చిన్న వయసులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు దాదాపుగా రూ. 50 లక్షల విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed