అత్తమామలపై కత్తితో దాడి చేసి పరారైన అల్లుడు..

by Disha Web Desk 11 |
అత్తమామలపై కత్తితో దాడి చేసి పరారైన అల్లుడు..
X

దిశ, మేడిపల్లి: అత్తమామలపై దారుణంగా కత్తితో దాడి చేసి అల్లుడు పరారైన సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ వీధి నెంబరు 6 లో నివాసముంటున్న సూరయ్య, రుక్మిణి వృద్ద దంపతులను వారి నివాసంలో పీర్జాదిగూడ లో నివాసముంటున్న అల్లుడు అనిల్ కుమార్ కత్తితో అత్తను గొంతు కోసి, మామ తల పగలగొట్టి పరారయ్యాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కాలనీవాసులు 108కు సమాచారం అందించి దంపతులను గాంధీ హాస్పిటల్ తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Next Story

Most Viewed