- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అరబిందో ఫార్మా కంపెనీలో సాల్వెంట్ లీక్... అపస్మారక స్థితిలో కార్మికులు..
దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో సాల్వెంట్ లీకై కార్మికులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరబిందో యూనిట్ -3 లోని ప్రాసెసింగ్ యూనిట్ -1 లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. సాల్వెంట్ ప్రాసెసింగ్ లో భాగంగా ముగ్గురు కార్మికులు రసాయన మిశ్రమం కలుపుతున్నారు. ఈ క్రమంలో సాల్వెంట్ లీకై బయటకు రావడంతో ఒక్కసారిగా గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు స్పృహ తప్పి ప్రాసెసింగ్ యూనిట్ లో పడిపోయారు.
వారిని కాపాడేందుకు మరో నలుగురు కార్మికులు వెళ్లారు. వారు కూడా రసాయన చర్యలకు గురై అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్మికులు ప్రేమ్ కుమార్, గౌరీ నాథ్, ప్రసాద్ రాజు, విమల, గౌరీ, యాసిన్ అలీ, శ్రీనివాస్ రావు లను కంపెనీ సిబ్బంది బాచుపల్లి లోని ఎస్ఎల్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.