ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి

by Disha Web Desk 12 |
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 మందికి పైగా ఓ పికప్ వాహనంలో ప్రయాణిస్తుండగా.. అతివేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో పికప్ వాహనంలో ఉన్న ఓ మహిళ, చిన్నారి, సహా మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి దీపక్ కుమార్ ఝా తెలిపారు.



Next Story

Most Viewed