Mohammed Shami : టీమిండియా పేస్ బౌలర్ షమీకి షాక్

by Disha Web Desk 4 |
Mohammed Shami : టీమిండియా పేస్ బౌలర్ షమీకి షాక్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా పేసర్ షమీకి కోల్‌కతా కోర్టు షాక్ ఇచ్చింది. మాజీ భార్య హసీన్ జహాన్‌కు షమీ నెలకు రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.50వేలు మాజీ భార్య ఖర్చుల నిమిత్తం కాగా మిగతా రూ.80 వేలు వారి కుమార్తె పోషణ కోసమని కోర్టు తెలిపింది. కాగా వీరు విడిపోయిన దగ్గర నుంచి షమీ కూతురు తల్లి హసీన్ వద్దే ఉంటుంది.

2018లో గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ పీఎస్‌ను ఆశ్రయించింది. దీంతో షమీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా హసీన్ భరణం కింద రూ.10లక్షలు ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. తన ఖర్చులకు రూ.7లక్షలు, కూతురి కోసం రూ.3లక్షలను అందులో పేర్కొంది. అయితే తాజా తీర్పు నేపథ్యంలో హసీన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. హసీన్ జహాన్‌తో షమీ 2014లో వివాహం జరిగింది.

Next Story

Most Viewed