నిక్కీ హత్యలో ప్రియుడికి సహకరించిన దుర్మార్గులు వీళ్లే..

by Dishafeatures2 |
నిక్కీ హత్యలో ప్రియుడికి సహకరించిన దుర్మార్గులు వీళ్లే..
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతి ప్రియుడు సాహిల్ గెహ్లాట్ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యా ఉదంతం ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు)న వెలుగులోకి వచ్చింది. ప్రియుడు సాహిల్ గెహ్లాట్ తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్ లో దాచాడు. అనంతరం అదే రోజును మరో యువతితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం పోలీసులు సాహిల్ గెహ్లాట్ ను అరెస్ట్ చేసి పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.


మొదటి నుంచి నిక్కీని హత్య చేసింది, అనంతరం ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచింది తానొక్కడినేనని చెబుతూ వచ్చిన సాహిల్.. తాజాగా మృతదేహాన్ని దాచడంలో తనకు ఐదుగురు సహకరించారని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. వారి వివరాలను పోలీసులకు చెప్పాడు. ఆ ఐదుగురిలో తన తండ్రి వీరేందర్, కజిన్స్ నవీన్, ఆశిష్ తో పాటు లోకేశ్, అమర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్లు ఒప్పుకున్నాడు. వీళ్ల సాయంతోనే తాను నిక్కీ మృతదేహాన్ని తరలించానని ఒప్పుకున్నాడు.

Next Story