- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుత్ షాక్ తో మూగజీవాలు బలి
by Disha Web Desk 1 |
X
దిశ, వెల్గటూర్ : విద్యుత్ షాక్ తో ఐదు గేదెలు మృత్యువాత పడిన ఘటన బుగ్గారం మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షం, గాలివాన బీభత్సానికి విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. దీతో తెల్లవారుజామున మేతకు అటుగా వెళ్లిన ఐదు గేదెలతో పాటు వెళ్లిన రెండు శునకాలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు విడిచాయి. విద్యుత్ స్తంభాలు విరిగి ఒక రోజు గడిచినా ట్రాన్స్ కో అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన గేదలు మృతి చెందాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని సదరు రైతులు వేడుకుంటున్నారు.
Next Story