- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం..
దిశ, కొల్చారం : మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలో మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. పోలీసులు తెలిపిన పూర్తివివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మణికొండ శివపురి కాలనీకి చెందిన మహమ్మద్ అతిర్ ఖాన్, మరో యువతీతో కలిసి మెదక్ లో తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ కు శనివారం హాజరయ్యారు.
వారిద్దరూ ఆదివారం తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా కిష్టాపూర్ శివారులో మల్లన్న గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న కార్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహమ్మద్ అథిర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. మహిళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన మహిళను 108 సాయంతో మెదక్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కొల్చారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.