రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం: నిర్మల్‌కు చెందిన నలుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

నిర్మల్‌కు చెందిన నేరేళ్ల ప్రమోద్ తన కుటుంబంతో కలిసి వైజాగ్ వెళ్లి తిరిగి వస్తుండగా.. రాజమండ్రి - జంగారెడ్డిగూడెం మధ్య మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.

రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం: నిర్మల్‌కు చెందిన నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, నిర్మల్ బ్యూరో: నిర్మల్‌కు చెందిన నేరేళ్ల ప్రమోద్ తన కుటుంబంతో కలిసి వైజాగ్ వెళ్లి తిరిగి వస్తుండగా.. రాజమండ్రి - జంగారెడ్డిగూడెం మధ్య మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టినట్లుగా సమాచారం. ఈ ఘటనలో ప్రమోద్, ఆయన భార్య ఊర్మిళ, కుమారుడు రితిన్, డ్రైవర్ అవేజ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story