రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, డోర్నకల్ : రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకోడు గ్రామానికి చెందిన తడకమళ్ళ నరేష్ (30) ద్విచక్ర వాహనం పై రాత్రి గొల్లచర్ల నుంచి చిలుకోడు వెళ్తుండగా గేదెను ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నరేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story