విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

by Disha Web Desk 12 |
విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సమీపంలో లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్పోర్ట్ వైపు నుంచి ఎన్ఏడి ఫ్లైఓవర్ వైపు వెళ్తున్న రోడ్‌లో బుల్లెట్ పై ఇద్దరూ వ్యక్తులు వెళుతుండగా.. కాకాని నగర్ సిగ్నల్ వద్ద వారి వెనకాల వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న వారిలో విష్ణువర్ధన్(28) సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఉప్పాడ భాగ్యరాజు‌కు తీవ్రగాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకుని హాస్పిటల్‌కి తరలించారు. కాగా తీవ్ర గాయాల కారణంగా విష్ణువర్ధన్ మృతి చెందాడు. మరొకరికి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణువర్ధన్(28) సాఫ్ట్వేర్ ఉద్యోగం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు మరొకరు ఉప్పాడ భాగ్యరాజ్‌గా గుర్తించారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని కేజీహెచ్ పోస్టుమార్టం కు తరలించి నైట్ రౌండ్ ఎస్.ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed