తిరుపతి జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపైనే ఆర్ఎంపీని హత్య చేసిన దుండగులు

by Disha Web Desk 19 |
తిరుపతి జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపైనే ఆర్ఎంపీని హత్య చేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను దుండగులు కిరాతకంగా హతమార్చారు. వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మండలంలో బాషా ఆర్ఎంపీ‌గా పనిచేస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు తెలుగుగంగా కాలువ వద్ద కత్తులతో పొడిచి బాషాను హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : రాళ్ల వాగు హత్య కేసును ఛేదించిన పోలీసులు..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed