- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతి జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపైనే ఆర్ఎంపీని హత్య చేసిన దుండగులు
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం ఓ ఆర్ఎంపీ డాక్టర్ను దుండగులు కిరాతకంగా హతమార్చారు.

X
దిశ, వెబ్డెస్క్: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం ఓ ఆర్ఎంపీ డాక్టర్ను దుండగులు కిరాతకంగా హతమార్చారు. వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మండలంలో బాషా ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు తెలుగుగంగా కాలువ వద్ద కత్తులతో పొడిచి బాషాను హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి : రాళ్ల వాగు హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Next Story






