ముగ్గురు వ్యక్తుల రిమాండ్

by Disha Web Desk 1 |
ముగ్గురు వ్యక్తుల రిమాండ్
X

దిశ, చిన్నశంకరంపేట : భూమి విషయంలో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని బక్కన్న యాదగిరిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు స్థానిక ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఎస్సై సుభాష్ గౌడ్ కథన ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన బక్కన్న యాదగిరి (58) గత నెల 21న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో బోన్ల సురేష్ యొక్క ఖాళీ స్థలంలో వడ్లు ఎండబెట్టి రాత్రి సమయంలో వర్షం కారణంగా వడ్లపైన టార్పాలు కప్పి వాటిపై రాళ్లు పెడుతున్నాడు. ఈ క్రమంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని సురేష్, దిడ్డికాడి మైపాల్, దిడ్డి కాడి కిషన్, బక్కన్న యాదగిరిని ఇష్టం వచ్చినట్లు కొట్టి అత్యాయత్యాయత్నానకి పాల్పడినట్లుగా 24న బక్కన్న మహేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు



Next Story

Most Viewed