మణికొండలో భారీగా నగదు పట్టివేత.. మునుగోడుకు తరలిస్తున్నట్లు అనుమానం!

by Disha Web Desk 2 |
మణికొండలో భారీగా నగదు పట్టివేత.. మునుగోడుకు తరలిస్తున్నట్లు అనుమానం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మణికొండలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మునుగోడుకు తరలిస్తుండగా డబ్బును పట్టుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలకు డబ్బులు ఇచ్చేందుకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన నగదు దాదాపు రూ. కోటి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్య పవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నగదు పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story