రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
X

దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరీంనగర్ మండలము బొమ్మకల్ గ్రామానికి చెందిన భక్తిని అంజయ్య , భార్య అనసూయ బొమ్మకల్ నుంచి శంకరపట్నం మండలం ముత్తారం తన కూతరు ఇంటికి జాతర నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజయ్యకు తీవ్ర గాయాలు కాగా, స్థానికుల సాయంతో 108 సిబ్బంది ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా స్పందించి కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed