చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
X

దిశ, చేగుంట: ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఇబ్రహీంపుర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఇబ్రహీంపుర్ గ్రామానికి చెందిన ఏర్రగొల్ల ఎల్లం (22) 28న రాత్రి తన స్పెండర్ బైక్ పై స్వగ్రామానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో చేగుంట శివారులోని జీవిక కంపెనీ వద్దకు రాగానే నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న మడవాత్ విఠల్ నిర్లక్ష్యం ఎల్లం బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎల్లం తలకు, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఎల్లం తుది శ్వాస విడిచాడు. మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.

Next Story

Most Viewed