అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, పరిగి: భార్య బంధువుల వివాహానికి వెళ్లి వచ్చేసరికి భర్త అనుమానస్పదంగా మృతి చెందాడు. పరిగి ఎస్ఐ పి. విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం ఖుదావంద్ పూర్ గ్రామానికి చెందిన సల్లోల్ల భీమయ్య, బాలమణి దంపతులు. బాలమణి గురువారం బంధువుల వివాహానికి వెళ్ళింది. ఇంట్లో ఉన్న భీమయ్య మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. వెంటనే భార్య బాలామణికి, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భీమయ్య మృతదేహంపై గాయాలు ఉండడంతో అతని మృతిపై బాలమణి, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story