గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. మరొకరికి గాయాలు

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి..  మరొకరికి గాయాలు
X

దిశ, అడ్డాకుల: మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. అడ్డాకుల ఎస్ఐ మాధవరెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర్నూల్ కి వెళ్తున్న మస్తాన్ భాష(27) మృతి చెందగా స్నేహితుడు రమేష్ బాబుకు గాయాలైనట్లు అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మస్తాన్ భాష తండ్రి అబ్దుల్ రహమాన్ ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story

Most Viewed