సౌదీలో నిర్మల్ వాసి మృతి

by Taduka Kalyani |

సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ వాసి గురువారం మృతి చెందారు

సౌదీలో నిర్మల్ వాసి మృతి
X

దిశ ప్రతినిధి నిర్మల్ : సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ వాసి గురువారం మృతి చెందారు. సౌదీ అరేబియా ఓమ్ లోజ్ మదీనా ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కు చెందిన మహమ్మద్ జావిద్(42) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జావేద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం రెండున్నర సంవత్సరాల క్రితం నిర్మల్ నుండి సౌదీ కు వెళ్లారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story