ఆటోపైకి దూసుకెళ్లిన ట్యాంకర్.. 9 మంది స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
ఆటోపైకి దూసుకెళ్లిన ట్యాంకర్.. 9 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ట్యాంకర్ ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న వారిలో తొమ్మిది మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. రోడ్డుపై చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed